డేట్ ఫిక్స్.. బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో టబు, జయరామ్, నవదీప్, సుశాంత్, నివేథా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని ఇచ్చాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు […]

డేట్ ఫిక్స్.. బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 29, 2019 | 4:52 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో టబు, జయరామ్, నవదీప్, సుశాంత్, నివేథా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని ఇచ్చాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్ అయ్యింది.

అల వైకుంఠపురములో మ్యూజిక్ కస్టర్ పేరుతో జరగబోతున్న ఈ ఈవెంట్‌ను జనవరి 6న నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవ్వరూ వస్తారన్న విషయంపై మాత్రం ఇంకా మూవీ యూనిట్ తెలపలేదు. ఇదిలా ఉంటే ఈ వేడుకకు రామ్ చరణ్, ఎన్టీఆర్‌ ఇద్దరు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే నాలుగు పాటలు విడుదల అయ్యాయి. వాటన్నింటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు యూట్యూబ్‌లో సామజవరగమన, రాములో రాముల పాటలు వంద మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించాయి. ఈ క్రమంలో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ మూవీపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.