Allu Arjun: పెద్ద డిజాస్టర్ నుంచి తప్పించుకున్న అల్లు అర్జున్..?
"కొన్నిసార్లు వదులుకోవడమే మంచిది" ఇది సినిమా స్టార్లకు ఎక్కువగా వర్తిస్తుంది. అనుకోకుండా కొందరు హీరోలు వదులుకునే సినిమాలు వారి కెరీర్కు కూడా మంచి సహాయాన్నే చేస్తుంటాయి. ఇప్పుడు ఓ సినిమా విషయంలో
“కొన్నిసార్లు వదులుకోవడమే మంచిది” ఇది సినిమా స్టార్లకు ఎక్కువగా వర్తిస్తుంది. అనుకోకుండా కొందరు హీరోలు వదులుకునే సినిమాలు వారి కెరీర్కు కూడా మంచి సహాయాన్నే చేస్తుంటాయి. ఇప్పుడు ఓ సినిమా విషయంలో స్టైలిష్ స్టార్ అలానే అనుకుంటున్నారట. ఆ సినిమా చేయకపోవడమే మంచిదైందని బన్నీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా స్టోరీ మొదట అల్లు అర్జున్ దగ్గరకే వచ్చిందట. అల్లు శిరీష్తో ఒక్క క్షణంను తెరకెక్కించిన వీఐ ఆనంద్.. ఆ సమయంలో బన్నీకి డిస్కో రాజా కథను చెప్పారట. ఈ కథ అల్లు అర్జున్కు బాగా నచ్చిందట. అయితే అప్పటికే నా పేరు సూర్యతో కాస్త ఢీలా పడి ఉన్న బన్నీ.. ఈ సినిమా విషయంలో కాస్త ఆలోచించారట. ప్రయోగం కంటే.. ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాను చేయడమే ఉత్తమమని భావించిన బన్నీ.. తనకు అచ్చొచ్చిన త్రివిక్రమ్కే ఫైనల్గా ఓటేశారట. ఇక వీరి కాంబినేషన్లో అల వైకుంఠపురములో తెరకెక్కడం.. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించడం టాలీవుడ్ మొత్తం చూసింది.
కాగా జనవరి 24న వచ్చిన డిస్కోరాజా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే ఫ్లాప్ టాక్ను తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో డిస్కో రాజాకు ఓకే చెప్పకపోవడమే మంచిదైందని బన్నీ కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతున్నారట. కాగా ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో బన్నీ స్మగ్లర్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ-సుక్కు కాంబినేషన్లో మూడో సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అటు ఫ్యాన్స్తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
Read This Story Also: చెర్రీ నెక్ట్స్ మూవీ.. లైన్లోకి స్టార్ దర్శకుడు.. ఈసారైనా కుదురుతుందా!