నాన్నకు ప్రేమతో.. బన్నీ ‘పద్మశ్రీ’ డిమాండ్!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నా లాస్ట్ సినిమాలు ‘సరైనోడు’, ‘డీజే’, ‘నా పేరు సూర్య’ తర్వాత ఒక కోరిక వచ్చింది. నెక్స్ట్ ఏ సినిమా చేసినా ఒక సరదా చిత్రం చేయాలని అనుకున్నాను. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి స్క్రిప్ట్ పూర్తి చేయడానికి.. సెట్స్ మీదకు వెళ్ళడానికి […]

నాన్నకు ప్రేమతో.. బన్నీ 'పద్మశ్రీ' డిమాండ్!
Follow us

|

Updated on: Jan 07, 2020 | 5:48 PM

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నా లాస్ట్ సినిమాలు ‘సరైనోడు’, ‘డీజే’, ‘నా పేరు సూర్య’ తర్వాత ఒక కోరిక వచ్చింది. నెక్స్ట్ ఏ సినిమా చేసినా ఒక సరదా చిత్రం చేయాలని అనుకున్నాను. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి స్క్రిప్ట్ పూర్తి చేయడానికి.. సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంత టైం పట్టిందన్నారు.

ఒకప్పుడు నా శ్రీమతితో మ్యూజికల్ బ్యాండ్స్ దగ్గరకు వెళ్లాను… ఇక అప్పటి నుంచి నా సినిమాలో కూడా ఉండాలని అనుకున్నాను. అలా నిజం చేసిన సాంగ్ ‘సామజవరగమన’. ఈ పాట బాగుందని అందరం అనుకున్నాం గానీ.. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదన్నారు. సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పాటను ఉద్దేశించి.. పొగిడిందని.. అప్పుడు అనిపించింది ‘ప్రపంచం ముందు వచ్చే హీరోయిజం కంటే.. పెళ్ళాం ముందు వచ్చే హీరోయిజంలో ఒక కిక్కు ఉంటుంది. ఇక ఈ సినిమాలో అన్ని పాటలు రాసిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

తమన్‌కు, నాకు ఇది హ్యాట్రిక్ ఆల్బం అని.. పాటలు అద్భుతంగా ఇచ్చాడని పొగిడారు. ఈ సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎంతో కష్టపడి పబ్లిసిటీ ప్లానింగ్ చేసి..  ‘రాములో రాములో’ సాంగ్‌కు హాఫ్ కోట్ స్టెప్ అని హ్యాష్ ట్యాగ్ ఇస్తే.. నా కూతురు మాత్రం ‘నాన్న.. దోశ స్టెప్ వేస్తున్నాడని చెప్పిందని చమత్కరించారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతూ.. మూడు సార్లు ఆయనతో పనిచేశానంటే.. అది నాకు ఆయన మీద ఇష్టమే.  ఇక నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే.. త్రివిక్రమ్ గారే కారణమని చెప్పారు. నా ప్రతీ కోరికను..  నా ప్రతీ ఇష్టాన్ని ఈ సినిమాలో ఆయన ఇంటరెస్ట్ పెట్టి చూపించారు. ఇక ఈ చిత్రం ఎంత పేరు తెచ్చుకున్నా.. దానికి త్రివిక్రమ్ గారే కారణం.

దాదాపు 10 సినిమాలు మా నాన్నగారితో కలిసి పని చేశాను. ఇప్పటివరకు మా డాడీకి సభా ముఖంగా థాంక్స్ చెప్పలేదు. అందుకే ఇప్పుడు చెబుతున్నానని.. ‘ధన్యవాదాలు’ చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు. అంతేకాకుండా గతంలో అల్లు అరవింద్‌పై వచ్చిన రూమర్స్ అన్నింటిని ఒక్క దెబ్బతో తుడిచి పెట్టేశారు. సుమారు 50 సినిమాలు పైగానే నిర్మించిన మా నాన్నకు ‘పద్మశ్రీ’ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్పిన బన్నీ.. ఒక గొప్పోడి పేరు మీరు టాటూ వేసుకున్నానని అనిపించుకునే వరకు ముందుకు వెళ్తూ ఉంటానని అన్నారు. కాగా, మెగాస్టార్ అంటే తనకు ప్రాణమన్న బన్నీ.. సంక్రాంతికి రిలీజయ్యి.. ‘దర్బార్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘ఎంత మంచివాడువురా’కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఇంకా మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..