‘సరిలేరు’ను డామినేట్ చేసిన ‘వైకుంఠపురం’.. ఓవర్సీస్లో బన్నీ జోరు!
ఈ సంక్రాంతికి టాలీవుడ్లో రెండు బడా చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అయితే.. మరొకటి బన్నీ ‘అల.. వైకుంఠపురములో’. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇదిలా ఉంటే ఓవర్సీస్లో అల్లు అర్జున్ కంటే మహేష్ హవానే ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిందే. అంతేకాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వరుసగా తొమ్మిది సార్లు వన్ మిలియన్ డాలర్ క్లబ్ హీరోగా […]
ఈ సంక్రాంతికి టాలీవుడ్లో రెండు బడా చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అయితే.. మరొకటి బన్నీ ‘అల.. వైకుంఠపురములో’. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇదిలా ఉంటే ఓవర్సీస్లో అల్లు అర్జున్ కంటే మహేష్ హవానే ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిందే. అంతేకాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వరుసగా తొమ్మిది సార్లు వన్ మిలియన్ డాలర్ క్లబ్ హీరోగా కూడా రికార్డు సృష్టించారు. అటు బన్నీకి మాత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తప్పితే చెప్పుకోదగ్గ వసూళ్ల రికార్డు లేదు.
అయితే తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురములో’ అమెరికాలో కేవలం 175 లొకేషన్లలో రిలీజయ్యి మొదటి రోజే దాదాపు 800కె డాలర్ల వసూళ్లు సాధించిందట. ‘సరిలేరు’ కంటే తక్కువ టికెట్ ధర(14 డాలర్ల)తోనే బన్నీ ఈ రేర్ ఫీట్ అందుకోవడం విశేషం. అక్కడ సరిలేరు నీకెవ్వరు టికెట్ ధర 22 డాలర్లు. దీనితో మహేష్ను స్టైలిష్ స్టార్ పూర్తిగా డామినేట్ చేశారనే చెప్పాలి. ఇప్పటికే అమెరికాలో కెరీర్ బెస్ట్ రికార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తొందర్లోనే వన్ మిలియన్ మార్క్ను కూడా రీచ్ కానున్నారు. కాగా, బన్నీ-త్రివిక్రమ్ కాంబోపైన ఓవర్సీస్లో విపరీతమైన క్రేజ్ ఉండగా.. ఇదే గనక కంటిన్యూ అయితే తొలి వీకెండ్లోనే అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టడం ఖచ్చితమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.