రిలీజ్కు ముందే హిట్ రూపం దాల్చింది…
స్టైలిష్ స్టార్ బన్నీ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం నగరంలోని యూసుఫ్గూడలో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ అధినేత, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ సినిమా తీయడం వెనక […]
స్టైలిష్ స్టార్ బన్నీ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం నగరంలోని యూసుఫ్గూడలో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ అధినేత, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ సినిమా తీయడం వెనక నేను ఉన్నా కూడా.. దీనిని కష్టపడి తీసింది నా స్నేహితుడు రాధాకృష్ణేనని.. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపాడు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిన్న కథ అంటూ తమ వద్దకు వచ్చి.. బ్రహ్మాండంగా తీశాడని.. ఇప్పుడు రిలీజ్కు ముందే హిట్ అనే రూపాన్ని ఇచ్చాడని కొనియాడారు. ఇక తమన్ 2019 వీడ్కోలు చెప్పడానికి ప్రతిరోజూ పండగే సినిమా ఇచ్చి.. ఇప్పుడు ఈ 2020 వెల్కమ్ చెప్పడానికి అల వైకుంఠపురములో సినిమా ఇచ్చాడని.. అందుకు తనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపారు.