‘మా’లో మేమంతా సర్దుకున్నాం – రాజశేఖర్
గత కొంతకాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఏదో ఒక సమస్యపై తరచూ మీడియాలో హైలైట్ అవుతూ వస్తోంది. సరిగ్గా రెండు నెలల క్రితం ‘మా’ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శివాజీరాజా ప్యానల్ ని నరేష్ ప్యానల్ పక్కా ప్రణాళికతో ఓడించింది. అందులో భాగంగా నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఉపాధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా జీవిత, రాజశేఖర్లు ఎన్నికయ్యారు. కాగా ఎన్నికల తర్వాత అంతా కలిసి పని చేస్తామని.. తమ మధ్య ఎటువంటి […]
గత కొంతకాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఏదో ఒక సమస్యపై తరచూ మీడియాలో హైలైట్ అవుతూ వస్తోంది. సరిగ్గా రెండు నెలల క్రితం ‘మా’ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శివాజీరాజా ప్యానల్ ని నరేష్ ప్యానల్ పక్కా ప్రణాళికతో ఓడించింది. అందులో భాగంగా నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఉపాధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా జీవిత, రాజశేఖర్లు ఎన్నికయ్యారు. కాగా ఎన్నికల తర్వాత అంతా కలిసి పని చేస్తామని.. తమ మధ్య ఎటువంటి గొడవలు ఉండవని నరేష్ వెల్లడించారు.
అదేవిధంగా నిన్న జరిగిన ‘మా’ తొలి సర్వసభ్య సమావేశానికి నరేష్ ప్యానల్ తో పాటు ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ‘మా’లోని సభ్యులకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఫిల్మ్ నగర్ లో నటీనటుల సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయిస్తుందని చెప్పారు.
అనంతరం హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ‘శివాజీ రాజా, నరేష్లు కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు’. అందరి సమక్షంలో ఏర్పాటైన ఈ సమావేశం విజయవంతం అయిందని.. మేమందరం కలిసిపోయామని రాజశేఖర్ స్పష్టం చేశారు.