అల్బేనియాను కుదిపేసిన భూకంపం..వందల మందికి గాయాలు
అల్బేనియాను భారీ భూకంపం కుదిపేసింది. ఇవాళ తెల్లవారుజామున 6.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో భూమి కంపించిపోయింది. అల్బేనియన్ తీరం వెంబడి ఈ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా..3వందలమందికి పైగా గాయపడ్గారు. భారీ సంఖ్యలో ఇళ్లు నేలమట్టమవగా..మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజధాని టిరానాకు వాయవ్యంగా 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది జియోలాజికల్ సర్వే. భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న తుమనే పట్టణంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందన్నారు అధ్యక్షుడు […]
అల్బేనియాను భారీ భూకంపం కుదిపేసింది. ఇవాళ తెల్లవారుజామున 6.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో భూమి కంపించిపోయింది. అల్బేనియన్ తీరం వెంబడి ఈ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా..3వందలమందికి పైగా గాయపడ్గారు. భారీ సంఖ్యలో ఇళ్లు నేలమట్టమవగా..మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజధాని టిరానాకు వాయవ్యంగా 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది జియోలాజికల్ సర్వే. భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న తుమనే పట్టణంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందన్నారు అధ్యక్షుడు ఇలిర్మెటా. డ్యురెస్, టిరానాలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశముందని..ప్రజలు ఇళ్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.