‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్ మరో రికార్డు
సదరన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
సదరన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమా పాటలూ యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్ర ఆల్బమ్ మరో ఘనతను సాధించింది.
ఈ సినిమా పాటలు జియో సావన్లో ఏకంగా 200 మిలియన్ ‘ప్లేస్’తో రికార్డు సాధించాయి. ఓ ప్రాంతీయ భాషా మూవీ పాటలకు ఈస్థాయిలో ఆదరణ దక్కడం విశేషం. 200 మిలియన్ ‘ప్లే’స్ మామూలు విషయంకాదు. అంటే జియో సావన్లో ఇప్పటి వరకు 20 కోట్ల సార్లు ఈ చిత్రం పాటలు విన్నారని అర్థం.
Nothing screams #WeAreIndia than being fans of reional music and art love their musicians and stars over time. ✨
An epitome #AlaVaikunthapurramuloo, which has now crossed 200 million+ streams on the album ⏯️https://t.co/BmosodgUNF@alluarjun #PoojaHegde @MusicThaman pic.twitter.com/kV8E1e6MTS
— JioSaavn (@JioSaavn) August 8, 2020