‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్ మరో రికార్డు

స‌ద‌ర‌న్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది.

'అల వైకుంఠపురములో' ఆల్బమ్ మరో రికార్డు
Follow us

|

Updated on: Aug 08, 2020 | 10:51 PM

స‌ద‌ర‌న్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది. ఈ సినిమా పాటలూ యూట్యూబ్​లో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్ర ఆల్బమ్ మరో ఘనతను సాధించింది.

ఈ సినిమా పాటలు జియో సావన్​లో ఏకంగా 200 మిలియన్ ‘ప్లేస్’తో రికార్డు సాధించాయి. ఓ ప్రాంతీయ భాషా మూవీ పాటలకు ఈస్థాయిలో ఆదరణ దక్కడం విశేషం. 200 మిలియన్ ‘ప్లే’స్ మామూలు విషయంకాదు. అంటే జియో సావన్​లో ఇప్పటి వరకు 20 కోట్ల సార్లు ఈ చిత్రం పాటలు విన్నారని అర్థం.