రోజూ గోమూత్రం తాగుతా : అక్షయ్ కుమార్

బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్ కుమార్  ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తాను ప్రతిరోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపారు.

రోజూ గోమూత్రం తాగుతా : అక్షయ్ కుమార్
Follow us

|

Updated on: Sep 11, 2020 | 2:44 PM

బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్ కుమార్  ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తాను ప్రతిరోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపారు. సాహస యాత్రికుడు బేర్​గ్రిల్స్​తో లైవ్​లో మాట్లాడుతూ ఈ విషయాన్ని రివీల్ చేశారు. ‘ఇన్​టూ ది వైల్డ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ, సూపర్​స్టార్ రజనీకాంత్ తర్వాత బేర్ గ్రిల్స్​తో కలిసి అడవిలో సాహసాలు చేశారు అక్షయ్. ఆ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా బేర్​గ్రిల్స్​తో కలిసి గురువారం లైవ్​ చాట్​ నిర్వహించారు. అక్షయ్​తో పాటు హీరోయిన్లు హ్యుమా ఖురేషి, లారా దత్తా పాల్గొన్నారు. ప్రజంట్ ‘బెల్ బాటమ్’ షూటింగ్​ కోసం వీరందరూ స్కాట్లాండ్​లో ఉన్నారు.

“మ్యాన్​ వర్సెస్ వైల్డ్ షోలో భాగంగా ఏనుగు మలంతో చేసిన సూప్ ఎలా తాగారు?​” అని హ్యుమా ఖురేషి అక్షయ్​ను ప్రశ్నించగా.. “అది నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే ఆయుర్వేద వైద్య ప్రక్రియలో భాగంగా, ప్రతిరోజు నేను గోమూత్రం తాగుతాను” అని చెప్పారు.

View this post on Instagram

@beargrylls @iamhumaq @discoveryplusindia @discoverychannelin

A post shared by Akshay Kumar (@akshaykumar) on

Also Read :

అభిమాని ఆకస్మిక మరణం.. గుండె పగిలింది అంటూ మహేష్ ట్వీట్

ఆన్​లైన్ క్లాసెస్ వినేందుకు ఫోన్ లేదని బాలుడు ఆత్మహత్య