అదరగొడుతున్న ‘కేసరి’ ట్రైలర్
ముంబయి: బాలీవుడ్ సూపర్స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కేసరి’. 1891లో జరిగిన సారాగడి యుద్ధంలో పాల్గొన్న హవీల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో అక్షయ్ నటిస్తున్నారు. అనురాగ్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతి చోప్రా కథానాయిక. కాగా.. ఈ చిత్ర ట్రైలర్ను రీసెంట్గా విడుదల చేశారు. ఓ రేంజ్ యాక్షన్తో ట్రైలర్ దుమ్ము రేపుతుంది. ‘నేను తన బానిసనని, భారతీయులంతా మూర్ఖులని ఓ బ్రిటిష్ వ్యక్తి నాతో అన్నాడు. అలాంటివారికి బుద్ధి […]
ముంబయి: బాలీవుడ్ సూపర్స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కేసరి’. 1891లో జరిగిన సారాగడి యుద్ధంలో పాల్గొన్న హవీల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో అక్షయ్ నటిస్తున్నారు. అనురాగ్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతి చోప్రా కథానాయిక. కాగా.. ఈ చిత్ర ట్రైలర్ను రీసెంట్గా విడుదల చేశారు. ఓ రేంజ్ యాక్షన్తో ట్రైలర్ దుమ్ము రేపుతుంది. ‘నేను తన బానిసనని, భారతీయులంతా మూర్ఖులని ఓ బ్రిటిష్ వ్యక్తి నాతో అన్నాడు. అలాంటివారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది’ అంటూ అక్షయ్ చెప్పే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది.
సారాగడి ప్రాంతంలో 21 సిక్కులకు పదివేల మంది అఫ్ఘానీయులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎందుకు సంభవించింది? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే కథ. ట్రైలర్లో అక్షయ్కుమార్ పోరాట సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. ‘నేను ధరించిన ఈ తలపాగా కేసరి, కారుతున్న నా నెత్తురు కేసరి..’ అంటూ అక్షయ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. మార్చి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.