బీహార్, అసోం వరదబాధితులకు.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ సాయం!
భారీ వర్షాల కారణంగా బీహార్, అసోం రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గత నాలుగు రోజులుగా కుర్తుస్తున్న భారీ వర్షాలకు బిహార్, అసోం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత
భారీ వర్షాల కారణంగా బీహార్, అసోం రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గత నాలుగు రోజులుగా కుర్తుస్తున్న భారీ వర్షాలకు బిహార్, అసోం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ పండ్ కు రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం చేస్తానని ప్రమాణం చేశారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.అక్షయ్ ఔదార్యానికి ముఖ్యమంత్రులు ఇద్దరూ కృతజ్ఞతలు తెలిపి ఆయన చేస్తున్న సహాయాన్ని ప్రశంసించారు.
మరోవైపు.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ పీఎం కేర్స్ ఫండ్కు రూ.25 కోట్లు అందించారు. ఇవే కాకుండా మాస్క్లు, పీపీఈ కిట్లు, రాపిడ్ ఫైర్ కిట్లు కొనుగోలు చేయడానికి బీఎంసీకి రూ.3 కోట్లు ఇచ్చారు. ముంబై పోలీస్ ఫౌండేషన్లో రూ.2 కోట్లు జమ చేశారు. అంతే కాకుండా, రోజువారీ కూలీలకు సహాయం చేయడానికి సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా) కు రూ.45 లక్షలు అందించారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన 40 మంది సైనిక జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నెలకొల్పిన వీర్ ట్రస్ట్ కు రూ. 5 కోట్లు ఇచ్చి తన గొప్ప మనుసు చాటుకున్నారు.
Read More:
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!