మంచి మ‌నిషిపై త‌ప్పుడు రాత‌లు..ఫైర‌యిన అక్ష‌య్

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్..క‌రోనా ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్నో డొనేష‌న్స్ ఇచ్చి త‌న మంచి మ‌న‌సు చాటుకున్నాడు. అత‌డి మంచిత‌నం గురించి ఎంత పొగిడినా త‌క్కువే. అటువంటి వ్య‌క్తిపై త‌ప్పుడు వార్త‌లు క్రియేట్ చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో అక్ష‌య్ త‌న సోద‌రిని స్పెష‌ల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి పంపిన‌ట్టు పుకార్లు స‌ర్కులేట్ చేశారు. దీనిపై రెస్పాండ్ అయిన‌ అక్ష‌య్ త‌ప్పుడు వార్త‌ల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వివ‌రాల‌లోకి వెళితే..బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న […]

మంచి మ‌నిషిపై త‌ప్పుడు రాత‌లు..ఫైర‌యిన అక్ష‌య్
Follow us

|

Updated on: Jun 01, 2020 | 3:42 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్..క‌రోనా ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్నో డొనేష‌న్స్ ఇచ్చి త‌న మంచి మ‌న‌సు చాటుకున్నాడు. అత‌డి మంచిత‌నం గురించి ఎంత పొగిడినా త‌క్కువే. అటువంటి వ్య‌క్తిపై త‌ప్పుడు వార్త‌లు క్రియేట్ చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో అక్ష‌య్ త‌న సోద‌రిని స్పెష‌ల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి పంపిన‌ట్టు పుకార్లు స‌ర్కులేట్ చేశారు. దీనిపై రెస్పాండ్ అయిన‌ అక్ష‌య్ త‌ప్పుడు వార్త‌ల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వివ‌రాల‌లోకి వెళితే..బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న సోద‌రి అల్కా భాటియా, ఆమె పిల్ల‌ల‌ని ఛార్ట‌ర్డ్ ప్లైట్ ద్వారా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఢిల్లీకి పంపిన‌ట్టు ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ రాసుకొచ్చింది. దీనిపై ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చిన అక్ష‌య్..ఆ న్యూస్ అవాస్త‌వం. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆమె ఎక్క‌డికీ ట్రావెల్ చెయ్య‌లేదు. ఆమెకి ఒక్క‌రే సంతానం. పూర్తి ఇన్ఫ‌ర్మేష‌న్ లేకుండా ఇలాంటి ఫాల్స్ న్యూస్ రాస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. అక్ష‌య్ ట్వీట్‌తో స‌ద‌రు వెబ్‌సైట్ ఆ ఆర్టిక‌ల్ తొలగించింది.