టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో బాలీవుడ్ ఖిలాడీ
గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా.. ఫోర్బ్స్ వార్షిక జాబితాలో అత్యధిక పారితోషికం పొందిన 100 మంది ప్రముఖుల్లో భారత్ నుంచి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మాత్రమే చోటుదక్కింది.
గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా.. ఫోర్బ్స్ వార్షిక జాబితాలో అత్యధిక పారితోషికం పొందిన 100 మంది ప్రముఖుల్లో భారత్ నుంచి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మాత్రమే చోటుదక్కింది. జూన్ 2019 నుంచి మే 2020 వరకూ దాదాపు రూ .366 కోట్ల సంపాదనతో ఈ బాలీవుడ్ ఖిలాడీ ప్రపంచంలోనే అత్యంత రాబడి కలిగిన టాప్ 100 సెలబ్రిటీల సరసన చేరారు. అమెరికాకు చెందిన కైలీ జెన్నర్ రూ 4453 కోట్ల ఆర్జనతో అగ్రస్ధానంలో నిలిచింది. ఈ జాబితాలో అక్షయ్ కుమార్కు 52వ స్దానం లభించింది.
కాగా.. గత ఏడాది అక్షయ్ రాబడి రూ 490 కోట్లు అయితే.. బాలీవుడ్ సూపర్స్టార్ సంపదపై కోవిద్-19 ప్రభావం పడిందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్తో అక్షయ్ కుమార్ జత కట్టడం ఈ ఏడాది జాబితాలో చోటుదక్కేందుకు కలిసొచ్చింది. ఫోర్బ్స్ టాప్ 10 అత్యధిక రాబడి కలిగిన సెలబ్రిటీల జాబితాలో వరుసగా కైలీ జెన్నర్, కన్యే వెస్ట్, రోజర్ ఫెదరర్, క్రిస్టియనో రొనాల్డో, లియోనెల్ మెస్పీ, టేలర్ పెర్రీ, నేమార్, హోవర్డ్ స్టెమ్, లెబ్రాన్ జేమ్స్, డ్వానే జాన్సన్లు చోటు సంపాదించారు.
https://www.instagram.com/p/B0XkaPaHRH8/?utm_source=ig_web_copy_link
Also Read: అంగన్వాడీల్లో ‘నాడు – నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..