రైతులకు అమలమ్మ సాయం..నిలిచింది ఎందరికో ఆదర్శం..
ప్రస్తుతం కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోన్న సమంయలో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నారు సినీ నటి, బ్లూ క్రాస్ హైదరాబాద్ కో ఫౌండర్ అమల అక్కినేని.
ప్రస్తుతం కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోన్న సమంయలో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నారు సినీ నటి, బ్లూ క్రాస్ హైదరాబాద్ కో ఫౌండర్ అమల అక్కినేని. రంగారెడ్డి షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలో సుమారు 600 మంది రైతులకు ఆమె ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు సుమారు 4 కిలోల చొప్పున విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు అందరూ భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. రైతులు సేంద్రీయ పద్దతుల్లో వ్యవసాయం చేయాలని సూచించారు. అందుకు రైతులు ఆసక్తి చూపితే శాస్త్రవేత్తలను పాపిరెడ్డిగూడకు పిలిచి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. అనంతరం అమల పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.