రోజుకో లేఖ రాస్తా: అఖిల ప్రియ
ఏపీ సీఎం జగన్కు రోజుకో లేఖ రాస్తానన్నారు మాజీ మంత్రి, కర్నూలు జిల్లా టీడీపీ నేత భూమా అఖిలప్రియ. అధికారులకు, పార్టీ నేతలకు అవినీతిపై ఏపీ సీఎం జగన్ మాటలు ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. తమ పాలనలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదని చెబుతున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్థితి వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. ఇదే విషయంపై ఆయనకు రోజుకో లేఖ రాస్తానని తెలిపారు అఖిలప్రియ. కిందిస్ధాయిలో అధికారులెవరూ ఆయన మాటలు పట్టించుకోవడం లేదన్నారు అఖిలప్రియ. […]
ఏపీ సీఎం జగన్కు రోజుకో లేఖ రాస్తానన్నారు మాజీ మంత్రి, కర్నూలు జిల్లా టీడీపీ నేత భూమా అఖిలప్రియ. అధికారులకు, పార్టీ నేతలకు అవినీతిపై ఏపీ సీఎం జగన్ మాటలు ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. తమ పాలనలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదని చెబుతున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్థితి వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. ఇదే విషయంపై ఆయనకు రోజుకో లేఖ రాస్తానని తెలిపారు అఖిలప్రియ.
కిందిస్ధాయిలో అధికారులెవరూ ఆయన మాటలు పట్టించుకోవడం లేదన్నారు అఖిలప్రియ. ఎక్కడ ఎలాంటి అవినీతి జరిగినా నేరుగా సీఎం జగన్కే లేఖ ద్వారా తెలియజేస్తానన్నారు. ఇదిలా ఉంటే ఇరుపార్టీల మధ్య ప్రకంపనలు రేపుతున్న ప్రజావేదిక కూల్చివేతపై ఆమె మాట్లాడుతూ ఇది కక్షపూరితంగానే చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో అక్రమ కట్టడాలున్నాయని, ప్రజావేదిక ప్రాంతంలోనే ఉన్న అనాథ ఆశ్రమాలు, మిగిలిన నిర్మాణాలు సైతం కూల్చితే అప్పుడు హర్షిస్తామన్నారు అఖిలప్రియ.