కోవిడ్ డేంజర్, 5 దేశాల్లో ఎయిరిండియా ఆఫీసులు క్లోజ్
కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిరిండియా 5 దేశాల్లో తన కార్యాలయాలను మూసివేస్తోంది. ఆస్ట్రియా, స్పెయిన్, డెన్మార్క్, స్వీడన్, ఇటలీ దేశాల్లో ఇక ఈ ఆఫీసులు పని చేయబోవని, కోవిడ్ మహమ్మారే..
కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిరిండియా 5 దేశాల్లో తన కార్యాలయాలను మూసివేస్తోంది. ఆస్ట్రియా, స్పెయిన్, డెన్మార్క్, స్వీడన్, ఇటలీ దేశాల్లో ఇక ఈ ఆఫీసులు పని చేయబోవని, కోవిడ్ మహమ్మారే ఈ తమ నిర్ణయానికి కారణమని ఈ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. అటు-వందే భారత్ మిషన్ కింద ఎయిరిండియా విమాన సర్వీసులను ప్రభుత్వం నిర్వహించడంలేదు. ప్రస్తుతం రెగ్యులర్ గా షెడ్యూల్ అయిన విమానాలు కూడా లేవు. కరోనా వైరస్ కారణంగా చాలావరకు విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ఇక తమ సిబ్బంది సంఖ్యను కూడా ఎయిరిండియా తగ్గించింది.