అయోధ్యలో సీఎం యోగీ.. రామయ్యకు పూజలు..
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ శనివారం మధ్యాహ్నం అయోధ్య నగరంలో పర్యటించారు. రామజన్మభూమిలో ఉన్న శ్రీ రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి..
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ శనివారం మధ్యాహ్నం అయోధ్య నగరంలో పర్యటించారు. రామజన్మభూమిలో ఉన్న శ్రీ రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి నిర్వహించే భూమి పూజ కార్యక్రమ పనులను పరిశీలించారు. సీఎం యోగీ వెంట శ్రీ రామ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్టు సభ్యులు కూడా ఉన్నారు. ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా.. పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు కూడా రానున్నారు. అంతేకాదు పలు హిందూ సంస్థకు చెందిన కీలక నేతలు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
కాగా, హనుమాన్ గర్హిలో ఉన్న హనుమంతుడికి కూడా సీఎం యోగి పూజలు చేశారు. ఆ తర్వాత మందిర నిర్మాణం కోసం తెచ్చిన శిలలను పరిశీలించారు. భూమి పూజలో ఐదు వెండి ఇటుకలను కూడా ఉంచనున్నారు. అవి కూడా ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఇక మందిర నిర్మాణం పూర్తిగా వీహెచ్పీ డిజైన్ ప్రకారమే కానుంది.
Ayodhya: Uttar Pradesh Chief Minister Yogi Adityanath offers prayers to Lord Ram at Ram Janmabhoomi site.
CM will also take stock of preparations today ahead of foundation laying of Ram temple. pic.twitter.com/hoyLO9oi5r
— ANI UP (@ANINewsUP) July 25, 2020