షాకింగ్..మరో ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా..!
పాకిస్థాన్లో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. తాజాగా మరో ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకింది. పాక్ క్రికెటర్లు షాదాబ్, హరీష్ రవూఫ్, హైదర్ అలీ ఈ వైరస్ బారిన పడినట్టు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
పాకిస్థాన్లో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. తాజాగా మరో ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకింది. పాక్ క్రికెటర్లు షాదాబ్, హరీష్ రవూఫ్, హైదర్ అలీ ఈ వైరస్ బారిన పడినట్టు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లే ముందు రావల్పిండిలో ఆదివారం కోవిడ్-19 నిర్ధారణ టెస్టులు నిర్వహించే వరకు వారిలో కరోనా సింటమ్స్ కనిపించలేదని సమాచారం. దీంతో ఈ ముగ్గురినీ వెంటనే హెమ్ క్వారంటైన్ కు ఆదేశించినట్టు పీసీబీ తెలిపింది. ఇమాద్ వసీం, ఎస్మాన్ షిన్వరికి కూడా టెస్టులు చేయగా వారికి నెగెటివ్గా నిర్ధారణ అయినట్టు వివరించింది. ఇంకా కొందరు ప్లేయర్స్, అధికారులకు కరాచీ, లాహోర్,పెషావర్లలో ఈ రోజు టెస్టులు చేయగా.. వారి రిపోర్టులు రేపు వచ్చే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పాకిస్థాన్లో ఇప్పటివరకు 1.82లక్షలకు పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 3606 మంది చనిపోయారు.