ఆర్టీసీని నడపడం అసాధ్యంః కేసీఆర్

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ప్రస్తుత ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితులు, కోర్టులో ఉన్న కేసులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టకుండా.. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయన్నారు. అంతేకాక తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 […]

ఆర్టీసీని నడపడం అసాధ్యంః కేసీఆర్
Follow us

|

Updated on: Nov 22, 2019 | 9:44 PM

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ప్రస్తుత ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితులు, కోర్టులో ఉన్న కేసులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టకుండా.. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయన్నారు. అంతేకాక తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు ఉన్నాయన్నారు. అటు కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలంటే రూ. 240 కోట్లు కావాలని.. పీఎఫ్ బకాయిల కింద నెలకు రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

మరోవైపు సీసీఎస్‌కు రూ.500 కోట్లు ఇవ్వడమే కాకుండా.. డీజిల్ బకాయిలను కూడా చెల్లించాలని కేసీఆర్ తెలిపారు. కాలం చెల్లిన 2600 బస్సులను రీ-ప్లేస్ చేయాలన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మరో ఎత్తు ఆర్టీసీని నడపడం… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ. 640 కోట్లు కావాల్సి ఉంటుంది. ఇక ఈ మొత్తం భారమంతా భరించే శక్తి  ఆర్టీసీకి లేదు.. ఆర్ధిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఆర్టీసీ వీటన్నింటిని అధిగమించడానికి ప్రభుత్వం కొంతమేరకు సహాయం చేసినా.. పూర్తిగా వీటి నుంచి బయటపడాలంటే ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు ఛార్జీలు పెంచడం.. ఒకవేళ అదే జరిగితే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే.. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆర్టీసీని యధావిధిగా నడపడం అసాధ్యమని సీఎం తేల్చి చెప్పారు. కాగా, రూట్ల ప్రైవేటీకరణపై ఇవాళ హైకోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉండటం వల్ల.. తీర్పు అనంతరం మరోసారి అన్ని అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

కాగా, ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు హైకోర్టు తీర్పును గౌరవించి సమ్మెను విరమించారు. ప్రభుత్వం షరతులు విధించకుండా కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరిన సంగతి విదితమే. ఈ తరుణంలో రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వెలువడే తీర్పు తర్వాత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?
ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?
ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారునే హెలికాప్టర్‌గా మార్చేశారు!
ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారునే హెలికాప్టర్‌గా మార్చేశారు!
విమానాల టేకాఫ్‌ సమయంలో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?
విమానాల టేకాఫ్‌ సమయంలో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?
అందుకే బోల్డ్‌గా నటించా.. అసలు విషయం చెప్పిన అనుపమ
అందుకే బోల్డ్‌గా నటించా.. అసలు విషయం చెప్పిన అనుపమ
30 కిలోలు తగ్గిపోయి అస్తిపంజరంలా మారిన నటుడు..ఎవరో గుర్తుపట్టారా?
30 కిలోలు తగ్గిపోయి అస్తిపంజరంలా మారిన నటుడు..ఎవరో గుర్తుపట్టారా?
ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్
ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్
సర్కార్ సొమ్ముకు కక్కుర్తిపడి అన్నచెల్లెలికి పెళ్లి..!
సర్కార్ సొమ్ముకు కక్కుర్తిపడి అన్నచెల్లెలికి పెళ్లి..!
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ