ఓనం పండుగ తర్వాత కేరళలో 126శాతం పెరిగిన కోవిడ్ కేసులు
కేరళలో కరోనా వైరస్ అంతకంతకు వ్యాప్తి చెందుతోంది.. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా వైరస్ మాత్రం కంట్రోల్ కావడం లేదు.. కేరళ వాసులు అత్యంత గొప్పగా జరుపుకున్న ఓనం పండుగ తర్వాత కరోనా పాజిటివ్
కేరళలో కరోనా వైరస్ అంతకంతకు వ్యాప్తి చెందుతోంది.. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా వైరస్ మాత్రం కంట్రోల్ కావడం లేదు.. కేరళ వాసులు అత్యంత గొప్పగా జరుపుకున్న ఓనం పండుగ తర్వాత కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడం గమనార్హం.. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ రెండు వరకు మలయాళీలు ఓనం పండుగను జరుపుకున్నారు.. ఈ పండుగ తర్వాత కేరళలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.. ఓనం తర్వాత ఏకంగా 126 శాతం కేసులు పెరిగాయి.. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్యలో కేరళ నాలుగో స్థానంలో నిలిచింది.. ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా, కర్నాటక రెండోస్థానంలో, మహారాష్ట్ర మూడోస్థానంలో నిలిచాయి.. అంత చిన్న రాష్ట్రంలో ఇన్నేసి కేసులు ఉండటం ఓ రకంగా సీరియస్ వ్యవహారమే! కేరళలో టెస్ట్ పాజిటివిటి రేటు 13.6 శాతం ఉంది.. కొత్త కేసుల పెరుగుదల కూడా మూడున్నర శాతంగా ఉంది.. ఓనం తర్వాత బాధితులు అమాంతం పెరిగాయి.. ముఖ్యంగా 20 ఏళ్ల నుంచి 40 ఏళ్లవారికే ఎక్కువగా కరోనా సోకింది.. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదనే ఉద్దేశానికి ప్రభుత్వం వచ్చింది.. మరోసారి లాక్డౌన్ విధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నదట ప్రభుత్వం..