కల్కీ ఖేల్ ఖతం.. మరి నెక్ట్స్ ఎవరు..?

వెల్ నెస్ కోర్సుల పేరుతో భారీగా విరాళాలు సేకరించి పక్కదారి పట్టించిన కల్కీ ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తాత్విక, ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీ భక్తులకు ఎర వేసి.. పెద్ద మొత్తంలో సేకరించిన కోట్లాది రూపాయలను తమ సొంత వ్యాపారాలకు ఉపయోగించుకున్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కల్కీ ఆశ్రమాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీ, తమిళనాడులో కోట్లాది రూపాయల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు సోదాల్లో గుర్తించారు. ఇప్పటి వరకూ రూ.43.9 కోట్ల […]

కల్కీ ఖేల్ ఖతం.. మరి నెక్ట్స్ ఎవరు..?
Follow us

| Edited By:

Updated on: Oct 19, 2019 | 2:11 PM

వెల్ నెస్ కోర్సుల పేరుతో భారీగా విరాళాలు సేకరించి పక్కదారి పట్టించిన కల్కీ ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తాత్విక, ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీ భక్తులకు ఎర వేసి.. పెద్ద మొత్తంలో సేకరించిన కోట్లాది రూపాయలను తమ సొంత వ్యాపారాలకు ఉపయోగించుకున్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కల్కీ ఆశ్రమాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీ, తమిళనాడులో కోట్లాది రూపాయల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు సోదాల్లో గుర్తించారు. ఇప్పటి వరకూ రూ.43.9 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సుమారు 40 ప్రాంతాల్లో ఉన్న కల్కి ఆశ్రమాలు, కార్యాలయాలు, వెల్‌‌నెస్ సెంటర్లు, కల్కి కుమారుడు కృష్ణ నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ సోదాల్లో రూ.43.9 కోట్ల నగదుతో పాటు 18 కోట్ల విలువైన మిలియన్ యూఎస్ డాలర్లు, 26 కోట్ల విలువైన 88 కిలోల బంగారం, 5 కోట్ల విలువైన 1271 క్యారెట్ల వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. 2014-2015లో విదేశీ కంపెనీల్లో రూ. 409 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. 25 ఏళ్ల క్రితం కల్కి ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి.. ఇప్పటివరకు ఆశ్రమ పేరును తరుచూ మార్చడానికి కారణాలేంటన్న దానిపై అధికారులు ఫోకస్ చేశారు. ట్రస్టు ఆస్తులు, బినామీలు, భూములకు సంబంధించిన పత్రాలతో కూడిన హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కల్కీ దంపతులు అజ్ఞాతంలోకి వెళిపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు గాలిస్తున్నారు. ఇదిలా వుంటే, కల్కి భగవాన్‌‌ను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారన్న చర్చ మొదలైంది. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిన స్వాములు, మఠాలు, ఆశ్రమాలు వేలాదిగా పుట్టుకొస్తున్నాయి.

ఊరికో ఆశ్రమం వెలుస్తోంది. రోజుకో బాబా పుట్టుకొస్తూ తాను ఓ దేవుడినని చెప్పుకుంటూ.. అమాయకుల నుంచి వేలకోట్లు దోచుకుంటున్నారు. ఆధ్యాత్మిక సేవ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి రాజకీయ నాయకులను కూడా శాసిస్తున్నారు. వారిని మాయలో పడేసి వేలకోట్లకు అధిపతులు అవుతున్నారు. ఇక కల్కీ భగవాన్ అంతం తర్వాత ఏపీలోని మరో ప్రముఖ స్వామి ఆశ్రమాలపై కూడా దాడులు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆధ్యాత్మిక ముసుగులో వ్యాపారం చేస్తూ వేలకోట్లు కొల్లగొడుతున్న దొంగ స్వాముల ఆగడాలకు ఐటీ అధికారులు చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్
ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్
సర్కార్ సొమ్ముకు కక్కుర్తిపడి అన్నచెల్లెలికి పెళ్లి..!
సర్కార్ సొమ్ముకు కక్కుర్తిపడి అన్నచెల్లెలికి పెళ్లి..!
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు