ఈ విషయంలో మహేష్, కళ్యాణ్ రామ్లు సేమ్ పించ్!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు పోటాపోటీగా నిలిచాయి. అవి సూపర్ స్టార్ రజనీకాంత్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైంకుఠపురములో, నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు. ఒక్కొక్క రోజు గ్యాప్లోనే ఈ సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించాయి. కాగా.. మహేష్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ సినిమాల్లో దాదాపు పాతనటులే కనిపించి మెప్పించారు. అయితే.. ముఖ్యంగా మహేష్, కళ్యాణ్ రామ్లు మాత్రం ఒక విషయంలో సేమ్ […]
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు పోటాపోటీగా నిలిచాయి. అవి సూపర్ స్టార్ రజనీకాంత్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైంకుఠపురములో, నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు. ఒక్కొక్క రోజు గ్యాప్లోనే ఈ సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించాయి. కాగా.. మహేష్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ సినిమాల్లో దాదాపు పాతనటులే కనిపించి మెప్పించారు. అయితే.. ముఖ్యంగా మహేష్, కళ్యాణ్ రామ్లు మాత్రం ఒక విషయంలో సేమ్ పించ్ని ఫాలో అయ్యారు. అదేంటంటే..
మహేష్ – విజయశాంతి ఇంతకు ముందు కొడుకు దిద్దిన కాపురంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ 30 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. తాజాగా కళ్యాణ్ రామ్కు ఇదే అనుభవం ఎదురైంది. ఎంతమంచి వాడవురా చిత్రంలో 30 ఏళ్ల తర్వాత సీనియర్ నటి సుహాసినితో నటించాడు.
1989లో సెప్టెంబర్ 21న కృష్ణ హీరోగా, విజయశాంతి హీరోయిన్గా విడుదలైన చిత్రం ‘కొడుకు దిద్దిన కాపురం’. ఈ చిత్రంలో మహేష్ బాబు బాల నటుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో కలిసి పనిచేశారు. మరోవైపు బాలకృష్ణ, సుహాసినిలు హీరో, హీరోయిన్లగా వచ్చిన చిత్రం ‘బాల గోపాలుడు’. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బాల నటుడిగా నటించి అలరించాడు. ఈ సినిమా 1989లో అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఎంత మంచివాడవురాలో కలిసి నటించారు.
అప్పుడు ఈ సినిమాల్లో బాల నటులుగా 22 రోజులు తేడాతో థియేటర్లలో సందడి చేశారు. ఇప్పుడు అదే యాక్టర్స్తో నాలుగు రోజుల తేడాతో రావడం విశేషం సంతరించుకుంది.