ముస్లింగా ఇండియాలో సేఫ్గా ఉన్నా.. అద్నాన్ సమీ..
దేశ వ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా అనేక చోట్లు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముస్లింలు దేశంలో సేఫ్గా ఉన్నారని ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ తెలిపారు. "ఇండియా ఐడియాస్ కాంక్లేవ్ 2020" కార్యక్రమంలో పాల్గొన్న అదన్నాన్..
దేశ వ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా అనేక చోట్లు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముస్లింలు దేశంలో సేఫ్గా ఉన్నారని ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ తెలిపారు. “ఇండియా ఐడియాస్ కాంక్లేవ్ 2020” కార్యక్రమంలో పాల్గొన్న అదన్నాన్.. తాను భారత్లో ముస్లింగా భద్రతతో ఉన్నట్లు వ్యాఖ్యానించారు. మరోవైపు బాలీవుడ్ హీరో అమీర్ఖాన్ భారత్లో ముస్లింలకు భద్రత కరువైందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని అదన్నాన్ సమీని ప్రశ్రించగా.. పై వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. సీఏఏ అనేది ఇండియన్ ముస్లింలకు సంబంధించిన అంశమేకాదన్నారు. ఇతర దేశాలనుంచి వచ్చిన వారికి మన దేశ పౌరసత్వం ఇచ్చేదని సమీ చెప్పుకొచ్చారు.
కాగా.. పాక్ గాయకుడైన సమీ.. ఎంతో కాలంగా భారత్లోనే జీవిస్తున్నారు. భారత పౌరసత్వం కావాలని సమీ కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో.. ఆయనకు భారత పౌరసత్వం ఇచ్చింది. అంతేకాదు.. తాజాగా ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా కేంద్రం బహుకరించింది.