ఈ సినిమా ఆదిని గుర్తిండిపోయేలా చేస్తుందా..!

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గోల్డ్ ఫిష్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ నటించిన గోల్డ్ ఫిష్ మూవీ టీజర్ కు.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే.. ఈ మూవీలో.. ఎయిర్ టెల్ భామ సాషా ఛెత్రి హీరోయిన్ గా నటింస్తోంది. గోల్డ్ ఫిష్ […]

ఈ సినిమా ఆదిని గుర్తిండిపోయేలా చేస్తుందా..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:20 PM

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గోల్డ్ ఫిష్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ నటించిన గోల్డ్ ఫిష్ మూవీ టీజర్ కు.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే.. ఈ మూవీలో.. ఎయిర్ టెల్ భామ సాషా ఛెత్రి హీరోయిన్ గా నటింస్తోంది.

గోల్డ్ ఫిష్ మూవీని కాశ్మీర్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. WHU IS THEY GOLD FISH అంటూ ఆసక్తికరంగా మలిచిన ఈ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. మొదటిసారి వెండితెరపై తన అద‌ృష్టాన్ని పరీక్షించుకోబోతోంది సాషా ఛెత్రి. వినాయకుడు ఫేమ్ సాయికిరణ్ అడవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.