రష్మిక ఆవేదన.. ఐటీ రైడ్స్పై ఏం చెప్పిందంటే?
తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె వాపోయింది. “గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది రష్మిక. తాజాగా.. మహేష్ బాబుతో, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసింది. ఈ సినిమా విడుదలై మంచి టాక్తో దూసుకుపోతోంది. తాజాగా మరో స్టార్ హీరో అల్లుఅర్జున్తో నటించేందుకు సిద్ధమవుతుండగా.. రష్మికకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రెండు […]
తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె వాపోయింది. “గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది రష్మిక. తాజాగా.. మహేష్ బాబుతో, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసింది. ఈ సినిమా విడుదలై మంచి టాక్తో దూసుకుపోతోంది. తాజాగా మరో స్టార్ హీరో అల్లుఅర్జున్తో నటించేందుకు సిద్ధమవుతుండగా.. రష్మికకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం కర్నాటలోని ఆమె ఇంటిపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.
రష్మిక ఇంటిలోనే కాకుండా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న కల్యాణ మండపం, యాడ్ ఎజెన్సీ, ఇతర వ్యాపార సంస్థల్లో సోదాలు జరిపారు. అంతే కాకుండా రష్మిక తం డ్రి మదన్ మంజన్నా, తల్లి సుమన్ల పేరుతో గత ఒక్క ఏడాదిలోనే కోట్లాది రూపాయల విలువైన సొత్తు జమ అయినట్లు గుర్తించారు ఐటీ అధికారులు. వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వాటిపై ఎటువంటి ధృవీకరణ పత్రాలను రష్మిక పేరెంట్స్ చూపించకపోవటంతో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వాటి వివరాలు అందించాలని ఐటీ నోటీసులో వెల్లడించారు అధికారులు.
ఐటీ సోదాల అంశంపై ఇప్పటికే రష్మిక మేనేజర్ స్పందించారు. రష్మికకు చెందిన ఆదాయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయని చెప్పారు. ఆమె ఆదాయానికి సంబంధించి పన్ను చెల్లింపులు అన్నీ సక్రమంగానే ఉన్నాయని చెప్పారు. అయితే ఆదాయపన్ను శాఖ అధికారులు రష్మిక తండ్రికి సంబంధించిన వ్యాపారాలు, ఆస్తులపై సోదాలు నిర్వహించినట్లు వివరించారు.
తన ఇంటిలో జరిగిన ఐటీ సోదాలపై రష్మిక రియాక్షన్ మరోలా ఉంది. తాను అధిక పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి తాను భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించే స్థాయికి ఇంకా ఎదగలేదని చెబుతోంది. సోదాల వ్యవహారంలో ఆదాయపన్ను శాఖతో చట్టపరంగానే ఎదుర్కొంటానని చెప్పింది రష్మిక మందన్న.