కంటైన్మెంట్ జోన్గా ప్రముఖ బాలీవుడ్ నటి అపార్ట్మెంట్
ప్రస్తుతం భారత్లో 2,86,579కి కేసులు ఉండగా.. దాదాపు 8 వేలకి పైగానే మృతి చెందారు. కాగా ఇక 90 వేల కేసులతో మహారాష్ట్ర.. భారత్లోనే మొదటి స్థానంలో ఉంది. తాజాగా ముంబైలో నటి మలైకా అరోరా నివాసం ఉంటున్న చోటే..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. లాక్డౌన్లో సడలింపులు తీసుకురావడంతో.. కోవిడ్ కేసులు మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుతం భారత్లో 2,86,579కి కేసులు ఉండగా.. దాదాపు 8 వేలకి పైగానే మృతి చెందారు. కాగా ఇక 90 వేల కేసులతో మహారాష్ట్ర.. భారత్లోనే మొదటి స్థానంలో ఉంది. తాజాగా ముంబైలో నటి మలైకా అరోరా నివాసం ఉంటున్న చోటే.. ఒకరికి కరోనా సోకడంతో బిల్డింగ్ను కంటైన్మెంట్ జోన్గా మార్చారు అధికారులు. జూన్ 8న ఆ బిల్డింగ్ సీల్ చేసినట్టు సమాచారం.
ఇక లాక్డౌన్లో సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మలైకా యాక్టీవ్గా ఉంటోంది. ప్రస్తుతం యోగా ఫొటోలతో అభిమానులకు.. ఆరోగ్యం పట్ల పలు సూచనలు చేస్తుంది. అలాగే ఎలాంటి సందర్భాల్లోనూ రోజుకు కనీసం గంటపాటు యోగా చేయడం మిస్ అవనని ఇప్పటికే చాలాసార్లు తెలిపింది మలైకా.