30 ఏళ్ల తర్వాత తెరపైకి అలనాటి అందాల ‘సత్యభామ’

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో మొత్తం బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ‘దేవినేని నెహ్రూ’ బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో హీరో తారకరత్న నటిస్తుండగా.. అలనాటి హీరోయిన్ జమున రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం డైరెక్టర్ శివనాగు. నాకు అతను దత్తపుత్రుడు లాంటివాడు.. మరీ పట్టుబట్టడంతో మరలా […]

30 ఏళ్ల తర్వాత తెరపైకి అలనాటి అందాల 'సత్యభామ'
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 12:09 PM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో మొత్తం బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ‘దేవినేని నెహ్రూ’ బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో హీరో తారకరత్న నటిస్తుండగా.. అలనాటి హీరోయిన్ జమున రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం డైరెక్టర్ శివనాగు. నాకు అతను దత్తపుత్రుడు లాంటివాడు.. మరీ పట్టుబట్టడంతో మరలా నటించడానికి కాదనలేకపోయాను. నాతో మళ్లీ మేకప్ వేయించిన ఘనత శివకే చెందుతుందని జమున తెలిపారు. అలాగే.. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో పోషిస్తున్న తారకరత్నకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు.