విజయ నిర్మల బయోపిక్పై క్లారిటీ ఇచ్చిన నరేష్
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. 'మహానటి' సినిమా మొదలు వరుసగా బయోపిక్లు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా, నిర్మాతగా ప్రముఖ సీనియర్ నటి విజయ నిర్మల జీవితంపై కూడా బయోపిక్ వస్తుందని..
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ‘మహానటి’ సినిమా మొదలు వరుసగా బయోపిక్లు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా, నిర్మాతగా ప్రముఖ సీనియర్ నటి విజయ నిర్మల జీవితంపై కూడా బయోపిక్ వస్తుందని గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అందులోనూ విజయ నిర్మల అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన మహిళాగా గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. ఈ బయోపిక్లో కూడా నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేషే నటిస్తుందని.. అందుకు ఆమె బాగా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు ఒకేసారి గుప్పుమన్నాయి.
ఇక కీర్తి సురేష్ గురించి చెప్పనవసరం లేదు. సావిత్రే మళ్లీ వచ్చి నటించారా అన్నట్లు ఆమె ఆ పాత్రకి ప్రాణం పోసింది. ఆ సినిమా ఎలాంటి సంచలన విజయం అందుకుందో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కీర్తి అయితే విజయ నిర్మల పాత్రకు సరిగ్గా సరిపోతుందని.. ఆమెను సీనియర్ నటుడు నరేష్ అడిగినట్లు వార్తలు వచ్చాయి.
అయితే తన తల్లి బయోపిక్పై వస్తోన్న వార్తలను కొట్టిపారేశారు విజయ నిర్మల అబ్బాయి నరేష్. అమ్మ పేరుతో ప్రస్తుతం ఎలాంటి బయోపిక్ నిర్మించడం లేదని.. ఇతరులకు కూడా ఎవరికీ బయోపిక్ పర్మిషన్స్ ఇవ్వలేదని నరేష్ తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న విజయ నిర్మల బయోపిక్పై తెరపడినట్టైంది.
Read More:
తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ
బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్
భారత్లో వెయ్యి దాటిన మృతుల సంఖ్య.. 31 వేలకు కరోనా పాజిటివ్ కేసులు