బాలీవుడ్లో విషాదం..ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ కన్నుమూత
బాలీవుడ్లో ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ పర్వీజ్ఖాన్ కన్నుమూశారు. జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం 'షాహిద్ తో పాటు 'అంధాధున్', 'బద్లాపూర్', 'జానీ గద్దర్', 'ఏజెంట్ వినోద్' వంటి హిట్ చిత్రాలకు ఈయన పనిచేశారు.
Action director Parvez Khan dies : బాలీవుడ్లో ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ పర్వీజ్ఖాన్ కన్నుమూశారు. జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ‘షాహిద్ తో పాటు ‘అంధాధున్’, ‘బద్లాపూర్’, ‘జానీ గద్దర్’, ‘ఏజెంట్ వినోద్’ వంటి హిట్ చిత్రాలకు ఈయన పనిచేశారు. కాగా పర్వీజ్ కు భార్య, కుమారుడు ఉన్నారు. సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ నిర్మించిన ‘అబ్ తక్ ఛప్పన్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న పర్వేజ్ ఖాన్.. కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూశారు. 55 ఏళ్ల ఈ యాక్షన్ డైరెక్టర్ జూలై 27 న ఛాతీ నొప్పితో రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించి కన్నుమూశారు.
“ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి పర్వీజ్. ‘షాహిద్’లోని ఓ కీలక యాక్షన్ సీన్ ను సింగిల్ టేక్లో కంప్లీట్ చేశారు . ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నా” అని హన్సల్ మెహతా ట్వీట్ చేశారు. నటుడు మనోజ్ బాజ్పేయి కూడా ఖాన్ మృతికి సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.
Read More : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆర్బీకేల్లో మార్కెటింగ్ సేవలు