కరోనాపై పోరాడి గెలిచిన షికా గోయల్
కరోనా మహమ్మారిపై ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. దాదాపు 6 నెలలుగా కంటికి కనపించని సూక్ష్మక్రిమితో భీకర పోరాటం సాగిస్తోంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు రాత్రింబవళ్లు ...
కరోనా మహమ్మారిపై ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. దాదాపు 6 నెలలుగా కంటికి కనపించని సూక్ష్మక్రిమితో భీకర పోరాటం సాగిస్తోంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడుతూ ప్రజలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పోరులో ఎంతోమంది పోలీసు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. అయితే ఈ పోరాటంలో చాలామంది కోలుకుంటున్నారు. మానసిక స్థైర్యం, పోషకాహారం, సరైన అలవాట్లతో కరోనాపై గెలిచి తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఇలా హైదరాబాద్లో మూడు కమిషనరేట్ల పరిధిలో కరోనా బారినపడిన పోలీస్ యంత్రాంగంలో దాదాపు 20 నుంచి 30శాతం మంది ఇప్పటికే పూర్తిగా కోలుకుని విధుల్లో చేరారు.
ఇలా కోవిడ్-19ను జయించి ఈ రోజు విధుల్లో చేరారు అదనపు కమిషనర్ షికా గోయల్. కరోనా మహమ్మారిపై పోరాడి గెలిచి విధుల్లో చేరేందుకు వచ్చిన షికా గోయల్కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్వాగతం పలికారు. కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన పనిలేదని.. కరోనాను ఓ సాధారణ ఫ్లూగా భావించాలని అన్నారు షికా గోయల్. అలాగని నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు తెలిపారు.