నా భర్తను అన్యాయంగా చంపేశారు.. చెన్నకేశవులు భార్య నిరసన!

డాక్టర్ దిశ హత్యా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దిశ కేసులోని నిందితులను నిన్న తెల్లవారుజామున చటాన్‌పల్లి బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనితో దిశకు తగిన న్యాయం జరిగిందని దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై నిందితుల కుటుంబీకులు మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు. అన్యాయంగా తమ వాళ్ళను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక అయితే.. తన […]

నా భర్తను అన్యాయంగా చంపేశారు.. చెన్నకేశవులు భార్య నిరసన!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 5:49 PM

డాక్టర్ దిశ హత్యా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దిశ కేసులోని నిందితులను నిన్న తెల్లవారుజామున చటాన్‌పల్లి బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనితో దిశకు తగిన న్యాయం జరిగిందని దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై నిందితుల కుటుంబీకులు మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు. అన్యాయంగా తమ వాళ్ళను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక అయితే.. తన భర్తను చంపిన చోటే.. తనను కూడా కాల్చమని ప్రాధేయపడింది.

అంతేకాకుండా ఇవాళ ఆమె ఈ ఎన్‌కౌంటర్‌పై రోడ్డెక్కి ధర్నా చేసింది. దేశంలో చాలా మంది అత్యాచారం చేసిన వాళ్ళు ఉన్నారని.. వాళ్ళని ఇప్పటివరకు ఎన్‌కౌంటర్‌ చేయలేదని.. కేవలం తన భర్తను మాత్రం ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని ప్రశ్నించింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని చెప్పింది. అయితే ఈలోపే పోలీసుల జోక్యం చేసుకుని చెన్నకేశవులు భార్య రేణుకకి నచ్చజెప్పి పంపించారు. కాగా, ఈ నిరసనలో ఆమెతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.