బ్రేకింగ్ : శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం..
Abolish Of Council: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్ కొన్ని కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక అంతా అనుకున్నట్లుగానే శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 11 గంటలకు మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరపనున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండలి రద్దు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక అసెంబ్లీలో ఆమోదముద్ర పొందిన తర్వాత ఈ బిల్లును వెంటనే కేంద్రానికి […]
Abolish Of Council: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్ కొన్ని కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక అంతా అనుకున్నట్లుగానే శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 11 గంటలకు మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరపనున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండలి రద్దు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక అసెంబ్లీలో ఆమోదముద్ర పొందిన తర్వాత ఈ బిల్లును వెంటనే కేంద్రానికి పంపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కేంద్రం మంత్రివర్గం కూడా దానికి ఓకే చెబితే పార్లమెంట్ ఆమోదం తెలిపే వరకు మండలి జరుగుతుంది.
భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి భూముల కేటాయింపుపై విషయంలో కూడా మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా కడప ఆర్అండ్బీ స్థలంలోని టీడీపీ కార్యాలయ లీజు రద్దుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, చినజీయర్ మఠానికి ఇంద్రకీలాద్రిపై 40 ఎకరాలు జగన్ సర్కార్ కేటాయించింది.
మండలికి మంగళం:
- శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ తీర్మానం
- అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీర్మానానికి కేబినెట్ ఆమోదం
- కాసేపట్లో అసెంబ్లీకి మండలి రద్దు తీర్మానం
- మండలి తీర్మానంపై చర్చించి ఆమోదించనున్న అసెంబ్లీ
- అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం
- ఏపీ రాజకీయ పరిణామాలపై కేంద్రం ఆరా
- మండలిని రద్దు చేయాలంటే కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తప్పనిసరి
- పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాలి
- రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయాలి
- కేంద్రం ఒప్పుకుంటే త్వరగానే రద్దయ్యే అవకాశం