‘జనరల్ డయ్యర్ మోదీ’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్!
భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘జనరల్ డయ్యర్ మోదీ’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సంబోధించింది. ఆప్ అధికార ట్విట్టర్ ఖాతాలో చేసిన ఈ ట్వీట్ను పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. న్యూఢిల్లీలోని మయాపురిలో జనాలపై రాళ్లు రువ్విన ఘటనను ఖండిస్తూ కేజ్రీవాల్ ఈ ట్వీట్ చేశారు. ఢిల్లీలో సుమారు 850 ఫ్యాక్టరీలను మూసేయాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కొన్ని ఫ్యాక్టరీలను సీల్ చేసేందుకు ఢిల్లీ మున్సిపల్ […]
భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘జనరల్ డయ్యర్ మోదీ’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సంబోధించింది. ఆప్ అధికార ట్విట్టర్ ఖాతాలో చేసిన ఈ ట్వీట్ను పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. న్యూఢిల్లీలోని మయాపురిలో జనాలపై రాళ్లు రువ్విన ఘటనను ఖండిస్తూ కేజ్రీవాల్ ఈ ట్వీట్ చేశారు.
ఢిల్లీలో సుమారు 850 ఫ్యాక్టరీలను మూసేయాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కొన్ని ఫ్యాక్టరీలను సీల్ చేసేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అధికారులు ప్రయత్నించడంతో మయాపురి ఏరియాలో ఉద్రిక్తత తలెత్తింది. భద్రతా బలగాలకూ, స్థానికులకూ మధ్య ఘర్షణ చెలరేగింది. దీనిపై కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ, ‘జనరల్ డయ్యర్ మోదీ’ పోలీసులు మయాపూరి నివాసులపై రాళ్లు రువ్వారంటూ ట్వీట్లో మండిపడ్డారు.
अपने ही व्यापारियों को इस तरह पीटना बेहद शर्मनाक है
व्यापारियों ने हमेशा धन और वोट से भाजपा का साथ दिया। बदले में भाजपा ने उनकी दुकानें सील की और उनको लाठियों से पीटा। चुनाव में भी व्यापारियों पर इतना बर्बर लाठी चार्ज? भाजपा साफ़ कह रही है- नहीं चाहिए भाजपा को व्यापारियों का साथ https://t.co/irVwvymdX8
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 13, 2019