టర్కీలో ఫస్ట్ లేడీతో ఆమిర్ ఖాన్ భేటీ, ఫాన్స్ అసంతృప్తి
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ టర్కీలో ఫస్ట్ లేడీ ఎమీన్ ఎర్డోగాన్ తో భేటీ అయ్యారు. ఆ దేశంలో తన లాలాసింగ్ చద్దా మూవీ షూటింగ్ త్వరలో పూర్తి అవుతున్న సందర్భంగా..
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ టర్కీలో ఫస్ట్ లేడీ ఎమీన్ ఎర్డోగాన్ తో భేటీ అయ్యారు. ఆ దేశంలో తన లాలాసింగ్ చద్దా మూవీ షూటింగ్ త్వరలో పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన ఆమెను కలుసుకున్నారు. అయితే ఆమిర్ చర్యను అనేక మంది నెటిజన్లు తప్పు పడుతున్నారు. కాశ్మీర్ విషయంలో ఇండియాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ..పాకిస్తాన్ కు వత్తాసు పలుకుతున్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భార్యను ఆమిర్ కలుసుకోవడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తన మూవీల్లో తనను భారత దేశభక్తునిగా చూపు కుంటూ మరో వైపు భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలపడమంటే ఇదేనంటున్నారు. ఇది హిపోక్రసీ కాక మరేమిటని ట్విట్టర్లో దుయ్యబడుతున్నారు. భారత్-టర్కీ మధ్య సంబంధాలు సజావుగా లేవు. జమ్మూ కాశ్మీర్ కి స్వయంప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసినప్పటినుంచీ ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. భారత చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్ ను టర్కీ తన మిత్ర దేశంగా చెప్పుకొంటోంది కూడా.
I had the great pleasure of meeting @aamir_khan, the world-renowned Indian actor, filmmaker, and director, in Istanbul. I was happy to learn that Aamir decided to wrap up the shooting of his latest movie ‘Laal Singh Chaddha’ in different parts of Turkey. I look forward to it! pic.twitter.com/3rSCMmAOMW
— Emine Erdoğan (@EmineErdogan) August 15, 2020