ఆధార్ ఆపరేటర్ వేలిముద్రలు చోరి, దుర్వినియోగం.. బయటికొచ్చిన ఆధారాలు

యూనిక్ ఐడీ(ఆధార్) పేరుతో మన సమాచారం మొత్తం 12 అంకెలున్న కార్డులో ఫీడ్ చేసింది భారత ప్రభుత్వం. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, పన్ను చెల్లింపులు ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఆ కార్డుతో ముడిపడిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సేఫ్‌ కాదు అంటూ పలువురు చెబుతూ వస్తుండగా.. వాటినన్నంటిని యుఐడీఏఐ(యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొట్టేస్తూ వస్తోంది. కానీ తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన కేసులో వినియోగదారుడి వేలిముద్రలు చోరి కాబడి, […]

ఆధార్ ఆపరేటర్ వేలిముద్రలు చోరి, దుర్వినియోగం.. బయటికొచ్చిన ఆధారాలు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:22 PM

యూనిక్ ఐడీ(ఆధార్) పేరుతో మన సమాచారం మొత్తం 12 అంకెలున్న కార్డులో ఫీడ్ చేసింది భారత ప్రభుత్వం. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, పన్ను చెల్లింపులు ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఆ కార్డుతో ముడిపడిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సేఫ్‌ కాదు అంటూ పలువురు చెబుతూ వస్తుండగా.. వాటినన్నంటిని యుఐడీఏఐ(యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొట్టేస్తూ వస్తోంది. కానీ తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన కేసులో వినియోగదారుడి వేలిముద్రలు చోరి కాబడి, దుర్వినియోగం అయ్యాయని ఆధారాలతో సహా బయటికొచ్చాయి.

గతేడాది హర్యానాకు చెందిన షియోఖండ్‌ అనే ఆధార్ ఆపరేటర్ వేలి ముద్రలు పలుచోట్ల ఒకేరోజు దుర్వినియోగం అయ్యాయి. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో ఆధార్ ఆపరేటర్‌గా పనిచేస్తోన్న షియోఖండ్ వేలిముద్రలు నవంబర్ 12, 2018న నాలుగు వేర్వేరు ప్రదేశాలలో వినియోగించబడ్డాయి. దీంతో అతడి కార్డును తాత్కాలికంగా నిలిపివేసింది ఆధార్ సంస్థ. మరోవైపు మోసం కేసులో షియోఖండ్‌ను ఉద్యోగం నుంచి తీసేశారు అతడు పనిచేసే సంస్థ అధికారులు.

దీనిపై మాట్లాడిన షియోఖండ్.. ఒక స్థానంలో పనిచేస్తూ ఒక రోజులో అన్ని స్థానాలు ప్రయాణించేందుకు తానేం దయ్యాన్ని కాదని అన్నారు. గతేడాదే ఆధార్‌ను అధికారులు బ్లాక్ చేసినప్పటికీ ఇప్పటికీ తన నంబర్‌ను వాడుతున్నారని.. దానికి సంబంధించిన మెయిల్స్ ఇంకా తనకు వస్తున్నాయంటూ ఆయన తన బాధను వ్యక్తపరిచాడు. తన ఆధార్ వివరాలతో రూ.33లక్షలకు సంబంధించిన మోసపూరిత లావాదేవీలు జరిగాయని, ఆ మొత్తాన్ని తన మీద పెనాల్టీగా వేశారని షియోఖండ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా ఆధార్ ఆపరేటర్‌గా ఉద్యోగాన్ని పోగొట్టుకున్న షియోఖండ్ ప్రస్తుతం ఓ మారుమూల గ్రామంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ గ్రామస్తులు పలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేలా అతడు సహాయం చేస్తున్నాడు. వీటిలో కొన్ని పనులకు తనకు ఆధార్ అవసరం అవుతుందని కానీ ప్రభుత్వం తనకు అనుమతిని ఇవ్వలేదని షియోఖండ్ చెప్పారు. అయితే ఇది ఒక వ్యక్తికే పరిమితం అవ్వలేదు. పలువురికి సంబంధించిన బయోమెట్రిక్‌లు దుర్వినియోగం అవుతున్నాయని, వారిలో షియోఖండ్ ఒకరని కొంతమంది అంటున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లభించిన నేపథ్యంలో ఆధార్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు