శంషాబాద్లో ఓ మహిళపై అత్యాచారం, హత్య
హైదరాబాద్ శంషాబాద్లో దారుణం జరిగింది. ఓ మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆ తర్వాత దారుణంగా ఆమెను హతమార్చారు. ఆనవాళ్లు తెలియకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని తొండుపల్లి గ్రామ శివారులో ఈ దారుణం చోటుచేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం ఉందని శంషాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించే […]
హైదరాబాద్ శంషాబాద్లో దారుణం జరిగింది. ఓ మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆ తర్వాత దారుణంగా ఆమెను హతమార్చారు. ఆనవాళ్లు తెలియకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని తొండుపల్లి గ్రామ శివారులో ఈ దారుణం చోటుచేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం ఉందని శంషాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడంతో ఎవరనేది గుర్తుపట్టడం పోలీసులకు సవాల్గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.