ఫేస్‌బుక్‌ పరిచయం..రూ.20 లక్షలు కాజేసిన కిలాడీ లేడీ

బాగా తెలిసినవాళ్లు, పరిచయం ఉన్నవాళ్లే ఈ రోజు మోసాలు చేస్తున్నారు. అలాంటిది..సోషల్ మీడియాలో పరిచయమైన అపరిచితులను అంత ఈజీగా నమ్మేస్తామా.? కర్మ కాలి నమ్మితే మాత్రం అడ్డంగా మోసపోవడం ఖాయం.

ఫేస్‌బుక్‌ పరిచయం..రూ.20 లక్షలు కాజేసిన కిలాడీ లేడీ
Follow us

|

Updated on: Nov 09, 2020 | 5:22 PM

బాగా తెలిసినవాళ్లు, పరిచయం ఉన్నవాళ్లే ఈ రోజు మోసాలు చేస్తున్నారు. అలాంటిది..సోషల్ మీడియాలో పరిచయమైన అపరిచితులను అంత ఈజీగా నమ్మేస్తామా.? కర్మ కాలి నమ్మితే మాత్రం అడ్డంగా మోసపోవడం ఖాయం. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి ఓ వ్యక్తి నుంచి ఒకటి కాదు, రెండు కాదు…ఏకంగా రూ.20 లక్షలకు బురిడీ కొట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల కేంద్రానికి చెందిన గిన్నారపు నాగేందర్‌కు ముఖ పుస్తకం( ఫేస్‌బుక్)‌ ద్వారా లండన్‌కు చెందిన మెర్సీ జాన్సన్‌ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య క్లోజ్‌నెస్ పెరగడంతో నాగేందర్‌ను మోసం చేసేందుకు యువతి స్కెచ్ వేసింది. రూ. 20 లక్షలు ఇస్తే 70వేల పౌండ్లు వస్తాయని నాగేందర్‌కు మాయ మాటలు చెప్పింది. ఆమె చెప్పిన విధంగా నాగేందర్‌ దశల వారీగా రూ.20లక్షలను యువతి ఖాతాలో డిపాజిట్‌ చేశాడు. తర్వాత తనకు రావాల్సిన డబ్బు రాకపోవడంతో మోషపోయానని తెలుసుకోని నాగేందర్‌ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌ నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :

కృష్ణా జిల్లాలో ఫేక్ ఆధార్ కార్డుల తయారీ ముఠా అరెస్ట్

మారేడిమిల్లి చేరుకున్న బన్నీ, రేపట్నుంచి షూటింగ్ షురూ

వ్యవసాయం విలువ తెలుసు : సీఎం జగన్