ఆ హత్యకు, చింతచెట్టుకు సంబంధమేంటి..?
అది విశాఖ ఏజెన్సీలోని ఓ గిరిజన గూడెం. అక్కడ 50 మంది ఆదివాసీలు నివాసముంటున్నారు. వీరు క్రూర మృగాలకు కూడా భయపడరు కాని ఆ గిరిజన గ్రామంలో చింత చెట్టు వద్ద జరిగిన దారుణ ఘటన స్థానికుల గుండెల్లో వణుకు పుట్టించింది. ఇప్పటికే మూఢ నమ్మకాలతో వణికిపోతున్న వీరికి కొత్తగా తుపాకీ కాల్పులు మరింత టెన్షన్ క్రియేట్ చేశాయి. ఆ గ్రామంలో నివసిస్తున్న జంపా శ్రీను అనే వివాహితుడు రోజూలానే పొలానికి వెళ్లాడు. కానీ మళ్లీ ఇంటికి […]
అది విశాఖ ఏజెన్సీలోని ఓ గిరిజన గూడెం. అక్కడ 50 మంది ఆదివాసీలు నివాసముంటున్నారు. వీరు క్రూర మృగాలకు కూడా భయపడరు కాని ఆ గిరిజన గ్రామంలో చింత చెట్టు వద్ద జరిగిన దారుణ ఘటన స్థానికుల గుండెల్లో వణుకు పుట్టించింది. ఇప్పటికే మూఢ నమ్మకాలతో వణికిపోతున్న వీరికి కొత్తగా తుపాకీ కాల్పులు మరింత టెన్షన్ క్రియేట్ చేశాయి. ఆ గ్రామంలో నివసిస్తున్న జంపా శ్రీను అనే వివాహితుడు రోజూలానే పొలానికి వెళ్లాడు. కానీ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. పొలం పనులు అయిపోయాక చింత చెట్టు కింద స్నేహితులతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా అదే గ్రామానికి చెందిన రమణాజీ అనే వ్యక్తి శ్రీనుని నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. శ్రీను హత్యకు ఆ చింత చెట్టే కారణమనుకుని గిరిజనులు భయాందోళనలో ఉన్నారు.
ఇదిలా ఉంటే..గ్రామంలో గత కొంత కాలంగా చేతబడి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ్రామస్తులంతా రమణాజీపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఆ పుకార్లకు కారణం జంపా శ్రీనునే అని తెలుసుకున్న రమణాజీ క్షణికావేశంలో శ్రీనుని హతమార్చాడు. అయితే ఆ పుకార్లే రమణాజీని హంతకుడిగా మార్చాయని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ముందు రేపిన పుకార్లతో పాటు శ్రీను హత్య స్థానికులను మరింత భయాందోళనకు గురి చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూఢ నమ్మకాలపై గూడెం వాసులకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది.