భానుడి ప్రతాపానికి బీర్ల కొరత

భానుడి ప్రతాపానికి బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది. వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్న మద్యం ప్రియులు బీర్లను తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. అయితే దాదాపు తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల బీర్లు లేవు అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. సిటీలో డిమాండ్‌కు తగ్గట్టుగా బీరు ఉత్పత్తి కాకపోవడంతో పలు వైన్ షాపుల ముందు నో బీర్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి సమీపంలో కేవలం ఐదు బ్రూవరీలు మాత్రమే బీరును ఉత్పత్తి […]

భానుడి ప్రతాపానికి బీర్ల కొరత
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 8:41 AM

భానుడి ప్రతాపానికి బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది. వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్న మద్యం ప్రియులు బీర్లను తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. అయితే దాదాపు తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల బీర్లు లేవు అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి.

సిటీలో డిమాండ్‌కు తగ్గట్టుగా బీరు ఉత్పత్తి కాకపోవడంతో పలు వైన్ షాపుల ముందు నో బీర్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి సమీపంలో కేవలం ఐదు బ్రూవరీలు మాత్రమే బీరును ఉత్పత్తి చేస్తున్నారు. బీరు ఉత్పత్తికి అవసరమైన నీటిని సింగూరు జలాశయం నుంచి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కానీ, తాగునీటి అవసరాల దృష్ట్యా బ్రూవరీలకు నీటి సరఫరాను మే 1 నుంచి నిలిపివేసింది. దాంతో ఉత్పత్తిదారులు సొంత బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకొని బీరును ఉత్పత్తి చేయాల్సి వస్తోంది. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ప్రతిరోజూ 2.50 లక్షల కేసుల బీర్లను ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రస్తుతం 1.5 లక్షల కేసులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ బీరునే బేవరేజెస్‌ కార్పొరేషన్‌ తన డిపోల ద్వారా అన్ని వైన్‌ షాపులు, బార్లకు సరఫరా చేస్తోంది.

ఈ నెల 30వ తేదీ వరకు మొత్తం 56.88 లక్షల కేసుల బీరును మాత్రమే షాపులకు సరఫరా చేసింది. అదే గత సంవత్సరం మే 30వ తేదీ వరకు 56.76 కేసులను సరఫరా చేసింది. వాస్తవానికి ఈ నెలలో 65-70 లక్షల కేసులకు గిరాకీ ఉందని వైన్‌ షాపులవారు చెబుతున్నారు. బీర్ల కొరత ఉండడంతో షాపుల వద్ద బీరు లేదంటూ బోర్డులు పెడుతున్నారు. నల్లగొండ, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో కూడా ఇలాంటి బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.