ఎమ్మెల్యే ఆమంచినే బురిడీ కొట్టిద్దామనుకున్న కోయదొర అరెస్ట్
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్కు టోకరా ఇచ్చేందుకు ట్రై చేశారు ఇద్దరు వ్యక్తులు. ఎమ్మెల్యేకు నరదిష్టి ఎక్కువగా ఉందని, దిష్టి పోవాలంటే పూజలు చేయాలని చెప్పిన హైదరాబాద్కు చెందిన కోయదొరలు.. చీరాలలోని ఆమంచి కృష్ణ మోహన్ ఇంటికి వచ్చారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన కోయదొరలు చిన్న చిన్న పూజలు చేసి రూ.5వేలు తీసుకున్నారు. ఈ పూజలతో నరదిష్టి పోదని.. మొత్తం నరదిష్టి పోవాలంటే పెద్ద పెద్ద పూజలు చేయాలని నమ్మించారు. అందుకు రూ.12లక్షలు […]
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్కు టోకరా ఇచ్చేందుకు ట్రై చేశారు ఇద్దరు వ్యక్తులు. ఎమ్మెల్యేకు నరదిష్టి ఎక్కువగా ఉందని, దిష్టి పోవాలంటే పూజలు చేయాలని చెప్పిన హైదరాబాద్కు చెందిన కోయదొరలు.. చీరాలలోని ఆమంచి కృష్ణ మోహన్ ఇంటికి వచ్చారు.
ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన కోయదొరలు చిన్న చిన్న పూజలు చేసి రూ.5వేలు తీసుకున్నారు. ఈ పూజలతో నరదిష్టి పోదని.. మొత్తం నరదిష్టి పోవాలంటే పెద్ద పెద్ద పూజలు చేయాలని నమ్మించారు. అందుకు రూ.12లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంతకుముందు పెద్దపెద్ద సినిమా వాళ్లకు, పేరుమోసిన రాజకీయ నాయకులకు పూజలు చేశామని ఇప్పుడు వారి పరిస్థితి బాగుందని నమ్మించే ప్రయత్నం చేశారు.
అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి.. ఎవరెవరికి పూజలు చేశారని ప్రశ్నించారు. వారు చెప్పిన పేర్లతో అనుమానం వచ్చిన ఆమంచి.. క్రాస్ ఎంక్వైరీ చేశారు. హైదరాబాద్కు ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకున్నారు. కోయదొరలు మోసగాళ్లు అని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్కు చెందిన కుమార్ బాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నిందితుని కోసం గాలిస్తున్నారు.