వనస్థలిపురంలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న వివాహిత
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక సుష్మా సాయినగర్లో నివేదిత అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. 8 నెలల కిందట సాఫ్ట్వేర్ ఉద్యోగితో నివేదిత వివాహం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడే ఓ అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో వీరిద్దరూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. అయితే ఇటీవల వీరి కుటుంబంలో తగాదాలు ఏర్పడంతో.. నివేదితను కసురుకోవడంతో.. తీవ్ర మనస్తాపానికి లోనైంది. దీంతో ఈరోజు ఉదయం అపార్ట్ మెంట్ ఐదో అంతస్తుకు చేరుకుంది. అక్కడి నుంచి […]
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక సుష్మా సాయినగర్లో నివేదిత అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. 8 నెలల కిందట సాఫ్ట్వేర్ ఉద్యోగితో నివేదిత వివాహం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడే ఓ అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో వీరిద్దరూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. అయితే ఇటీవల వీరి కుటుంబంలో తగాదాలు ఏర్పడంతో.. నివేదితను కసురుకోవడంతో.. తీవ్ర మనస్తాపానికి లోనైంది. దీంతో ఈరోజు ఉదయం అపార్ట్ మెంట్ ఐదో అంతస్తుకు చేరుకుంది. అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకు దూకేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.