Woman Committed Suicide: సంక్రాంతి పండువకి కొత్త బట్టలు కొనలేదని భర్త తో గొడవ పడి ఆత్మహత్య చేసుకున్న ఓ వివాహిత

సంక్రాంతికి కొత్త బట్టలు కొనుక్కోవాల్సిందే అన్నట్లు ఉంటారు..పేద, ధనిక అనే తేడాలేకుండా తమ స్థాయిలో కొత్త బట్టలు కొనుకుంటారు. అయితే సంక్రాంతి పండువకి కొత్త బట్టలు కొనలేదని ఓ వివాహిత భర్త తో గొడవ పడి చివరికి...

Woman Committed Suicide: సంక్రాంతి పండువకి కొత్త బట్టలు కొనలేదని భర్త తో గొడవ పడి ఆత్మహత్య చేసుకున్న ఓ వివాహిత
Follow us

|

Updated on: Jan 11, 2021 | 3:12 PM

Woman Committed Suicide:సంక్రాంతి పండుగ వస్తుందంటేనే తెలుగు వారి లోగిళ్ళలో నెలరోజుల ముందు నుంచి సందడి మొదలవుతుంది. రంగవల్లులు, గొబ్బెమ్మలు కొత్త అల్లుళ్ళ రాకతో కొత్త శోభను సంతరించుకుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలైతే.. సంక్రాంతికి కొత్త బట్టలు కొనుక్కోవాల్సిందే అన్నట్లు ఉంటారు..పేద, ధనిక అనే తేడాలేకుండా తమ స్థాయిలో కొత్త బట్టలు కొనుకుంటారు. అయితే సంక్రాంతి పండువకి కొత్త బట్టలు కొనలేదని ఓ వివాహిత భర్త తో గొడవ పడి చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని నేరడి–బికి చెందిన వివాహిత మునగవలస వాహిని శనివారం రాత్రి పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. అర్ధరాత్రి వేళ ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వాహిని ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వా స్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో మృతురాలి తండ్రి పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేశాడు. సంక్రాంతికి తన అల్లుడు అప్పన్న కొత్త బట్టలు కొనలేదని దీంతో మనస్తాపంతోనే పురుగులు మందు తాగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బత్తిలి ఎస్‌ఐ కరణం వెంకటసురేష్‌ తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.

Also Read: 1947 తర్వాత తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్స్ సమావేశాలను నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం