మద్యం మత్తులో అత్తను నరికి చంపిన అల్లుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో పిల్లను ఇచ్చిన అత్తానే కడతేర్చాడు కసాయి అల్లుడు. కాపురం సరిగా చేసుకుని మందలించిన పాపానికి గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మద్యం మత్తులో అత్తను నరికి చంపిన అల్లుడు
Follow us

|

Updated on: Aug 01, 2020 | 6:02 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో పిల్లను ఇచ్చిన అత్తానే కడతేర్చాడు కసాయి అల్లుడు. కాపురం సరిగా చేసుకుని మందలించిన పాపానికి గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దమ్మపేట మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన కురం రాంబాబుకు అదే గ్రామానికి చెందిన మడకం వాణి తన కూతురును ఇచ్చి వివాహం చేసింది. అయితే, గత కొన్ని రోజులుగా పని లేక రాంబాబు మద్యానికి బానిస అయ్యాడు. కుటుంబాన్ని పట్టించుకోక నిత్యం తాగి వచ్చి గొడవకు దిగుతున్నాడు. ఇదే క్రమంలో అల్లుడిని అత్త మందలించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా అల్లుడు రాంబాబు అత్త వాణిపై దాడి చేశాడు. పక్కనే ఉన్న గొడ్డలితో అత్త తలను నరికి వేశాడు. ఒక్కసారిగా కుప్పకూలిన వాణి అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందుడు రాంబాబును అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.