ధోనీ​కి చేనేత కార్మికుడి స్పెషల్ గిఫ్ట్

ఆగస్టు 15న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన ఎంఎస్​ ధోనీ..ఫ్యాన్స్ అంద‌ర్నీ షాక్‌కు గురిచేసిన సంగ‌తి తెలిసిందే.

ధోనీ​కి చేనేత కార్మికుడి స్పెషల్ గిఫ్ట్
Follow us

|

Updated on: Aug 27, 2020 | 8:25 AM

ఆగస్టు 15న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన ఎంఎస్​ ధోనీ..ఫ్యాన్స్ అంద‌ర్నీ షాక్‌కు గురిచేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక‌మంది తాజా, మాజీ క్రికెటర్లు ధోనీతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అత‌డి ఆట‌తీరును, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను కొనియాడారు. ఇక అభిమానులు కూడా 16 ఏళ్ల పాటు మ‌హీ భారత క్రికెట్ జ‌ట్టుకు చేసిన సేవ‌లను గుర్తుచేసుకున్నారు.‌

కేవ‌లం​ ధోనీ ఆటతీరుకు మాత్ర‌మే కాదు అతడి వ్యక్తిత్వానికి కూడా అభిమానులు ఎక్కువ‌. వారందరూ అతడిని ‘కెప్టెన్​ కూల్’​గా పిలుచుకుంటారు. అయితే తమిళనాడులోని అభిమానులు ఇంకాస్త స్పెష‌ల్. ధోనీని అన్నలా భావించి ‘తలా’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఈ క్ర‌మంలో తమిళనాడులోని చెన్నిమలైకు చెందిన అప్పూసామి అనే చేనేత కార్మికుడు ధోనీపై త‌న‌కు ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. ధోనీ, తన కుమార్తె జీవా ఫోటోల‌ను ఓ దుప్పటిపై వచ్చేలా మగ్గంపై నేశాడు. దానిపై ‘తలా’ అని ఆంగ్లంలో కనిపించే విధంగా రూపొందించాడు. గతంలో ఎంతోమంది సెల‌బ్రిటీల‌ చిత్రాలను దుప్పట్లపై డిజైన్​ చేసి గుర్తింపు పొందాడు అప్పూస్వామి. ఈ దుప్పటి త‌యారుచేయ‌డానికి దాదాపు 15 రోజుల స‌మ‌యం పట్టిందని తెలిపాడు. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్​ కోసం యూఏఈ వెళ్లగా.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అత‌డిని కలిసి ఆ కళాఖండాన్ని స్వయంగా తానే అందిస్తానని అప్పూసామి తెలిపాడు.

Also Read :

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

ప్రధానికి సీఎం జగన్ లేఖ, ఈ అంశం గురించే