ఆస్పత్రియే కళ్యాణ వేదికగా ఒకటైన ప్రేమజంట
పెద్దలను ఎదిరించిన జంట ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అదే పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. ఇందుకు ఓ ప్రభుత్వ ఆస్పత్రి వేదిక అయ్యింది.
పెద్దలను ఎదిరించిన జంట ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అదే పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. ఇందుకు ఓ ప్రభుత్వ ఆస్పత్రి వేదిక అయ్యింది. ఈ కళ్యాణ వైభోగం ఘటన జిగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రేమజంట వారి గ్రామ పెద్దల సాక్షిగా జిగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకటయ్యారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన యువకుణ్ని ప్రేమించింది. ఇందుకు కుటుంబసభ్యులను ఒప్పేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఇక, ఆ యువకుడితో తన పెళ్లికాదేమోనన్న భయంతో కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో స్థానికులు ఆ యువతిని చికిత్స కోసం వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె ప్రేమను అర్దం చేసుకున్న గ్రామపెద్దలు కుటుంబసభ్యులను ఒప్పించారు. ఆసుపత్రిలోనే ఆ యువకుడితో యువతికి పెళ్లి తంతు జరిపించారు. ఆస్పత్రి పేషెంట్లు,సిబ్బందితోపాటు గ్రామపెద్దల సమక్షంతో ఆ జంట ఒకటయ్యారు.