స్కూల్‌లో కాల్పులు.. 10మంది మృతి

బ్రెజిల్‌లోని నుజానో ప్రాంతంలో ఓ హైస్కూల్‌లో దుండగులు కాల్పులు జరిపారు. మొహానికి మాస్క్‌లు వేసుకొని స్కూల్‌లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10మంది చనిపోగా, 17మంది గాయపడ్డారు. అందులో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. స్కూల్ మొత్తం రక్తసిక్తంగా మారింది. పిల్లలకు స్నాక్స్ బ్రేక్ ఇచ్చిన సమయంలో దుండగులు ఈ కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు స్కూల్‌ను చుట్టుముట్టాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఓ దుండగుడు హతమయ్యాడు. కాల్పులు జరిపిన […]

స్కూల్‌లో కాల్పులు.. 10మంది మృతి
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:26 PM

బ్రెజిల్‌లోని నుజానో ప్రాంతంలో ఓ హైస్కూల్‌లో దుండగులు కాల్పులు జరిపారు. మొహానికి మాస్క్‌లు వేసుకొని స్కూల్‌లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10మంది చనిపోగా, 17మంది గాయపడ్డారు. అందులో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. స్కూల్ మొత్తం రక్తసిక్తంగా మారింది. పిల్లలకు స్నాక్స్ బ్రేక్ ఇచ్చిన సమయంలో దుండగులు ఈ కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు స్కూల్‌ను చుట్టుముట్టాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఓ దుండగుడు హతమయ్యాడు. కాల్పులు జరిపిన సమయంలో స్కూల్‌లో వెయ్యి మంది పిల్లలున్నారు. దుండగులిద్దరు 20 నుంచి 25ఏళ్ల వయసున్న వారేనని స్థానికులు తెలిపారు. ఈ ఘనటపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.