ఆర్మీ బేస్‌క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి.. 8 మంది మృతి

సోమాలియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని మొగాడిషులోని మిలటరీ బేస్ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన శనివారం నాడు చోటుచేసుకుంది. ఈ దాడిలో ఎనిమిది మంది..

ఆర్మీ బేస్‌క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి.. 8 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 5:55 AM

సోమాలియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని మొగాడిషులోని మిలటరీ బేస్ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన శనివారం నాడు చోటుచేసుకుంది. ఈ దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో 14 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, వార్తా-నబడ్డా జిల్లాలో ఏప్రిల్‌ 12వ తేదీన ఆర్మీ బ్రిగేడ్ స్థావరం ఎంట్రెన్స్‌ వద్ద కూడా ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది తెలియరాలేదు.

Read More :

మహారాష్ట్రలో 5లక్షలు దాటిన కేసులు

దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు