గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి!
రాజస్థాన్ నుంచి గుజరాత్లోని ఉకాయ్ పట్టణానికి వెళుతున్న ట్యాంకర్ బస్సు జీపు పరస్పరం ఢీకొన్నాయి. తపి జిల్లాలో బస్సు-ట్యాంకర్-జీపు పరస్పరం ఢీకొన్న ఘటనలో 8 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోన్గంద్ తాలూకా పరిధిలో గుజరాత్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న మరో ట్యాంకర్ పరస్పరం ఢీకొన్నాయి. అక్కడికి కొద్ది సేపటికే ఓ జీపు బస్సును వెనుక నుంచి […]
రాజస్థాన్ నుంచి గుజరాత్లోని ఉకాయ్ పట్టణానికి వెళుతున్న ట్యాంకర్ బస్సు జీపు పరస్పరం ఢీకొన్నాయి. తపి జిల్లాలో బస్సు-ట్యాంకర్-జీపు పరస్పరం ఢీకొన్న ఘటనలో 8 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోన్గంద్ తాలూకా పరిధిలో గుజరాత్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న మరో ట్యాంకర్ పరస్పరం ఢీకొన్నాయి. అక్కడికి కొద్ది సేపటికే ఓ జీపు బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.
కాగా.. ఈ ప్రమాదంలో మూడు వాహనాల్లో మొత్తం 8 మంది మరణించారు. గాయపడిన 22 మందిని స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు. ట్యాంకర్ రాంగ్రూట్లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ట్యాంకర్ రాజస్థాన్ నుంచి గుజరాత్లోని ఉకాయ్ పట్టణానికి వెళుతోంది. ట్యాంకర్ డ్రైవర్పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.