ప్రజాస్వామ్య దేశంలో ఇంత ఘోరమా..? గ్రామ సభను ధిక్కరించారని..
ప్రశ్నించడం వారి తప్పైంది. ఉద్యమంలో జరుగుతున్న తీరుపై ప్రశ్నించడంతో.. నిర్ధాక్షిణ్యంగా చంపేశారు జార్ఖండ్ రాష్ట్రంలోని పత్తల్గడీ ఉద్యమకారులు. ఒకర్నీ కాదు.. ఇద్దర్నీ కాదు.. ఏకంగా ఏడుగురు వ్యక్తులను హతమార్చారు. ఈ ఘోర సంఘటన వెస్ట్ సింగ్బమ్ జిల్లాలో చోటుచేసుకుంది. పత్తల్గడీ ఉద్యమం విషయమై జిల్లాలోని బురులికేర గ్రామంలో మంగళవారం రాత్రి గ్రామసభ జరిగింది. అయితే ఈ సభలో ఓ ఏడుగురు వ్యక్తులు ప్రశ్నిస్తూ.. వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో వారిపై కక్ష్య గట్టిన ఉద్యమకారులు.. ఆ ఏడుగురు […]
ప్రశ్నించడం వారి తప్పైంది. ఉద్యమంలో జరుగుతున్న తీరుపై ప్రశ్నించడంతో.. నిర్ధాక్షిణ్యంగా చంపేశారు జార్ఖండ్ రాష్ట్రంలోని పత్తల్గడీ ఉద్యమకారులు. ఒకర్నీ కాదు.. ఇద్దర్నీ కాదు.. ఏకంగా ఏడుగురు వ్యక్తులను హతమార్చారు. ఈ ఘోర సంఘటన వెస్ట్ సింగ్బమ్ జిల్లాలో చోటుచేసుకుంది.
పత్తల్గడీ ఉద్యమం విషయమై జిల్లాలోని బురులికేర గ్రామంలో మంగళవారం రాత్రి గ్రామసభ జరిగింది. అయితే ఈ సభలో ఓ ఏడుగురు వ్యక్తులు ప్రశ్నిస్తూ.. వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో వారిపై కక్ష్య గట్టిన ఉద్యమకారులు.. ఆ ఏడుగురు గ్రామస్తులను కిడ్నాప్ చేశారు. అనంతరం వారిని సమీపంలో తీసుకెళ్లి.. రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. గ్రామసభను ధిక్కరించినందుకే ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. ఈ దారుణ ఘటనపై జార్ఖండ్ సీఏం హేమంత్ సోరేన్ విచారం వ్యక్తం చేశారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేదిలేదన్నారు.