తెలంగాణ : మాస్కు ధరించని 67 వేల మందిపై కేసులు..
కోవిడ్-19 మహమ్మారి తెలుగు రాష్ట్రాలపై పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను పదే, పదే సూచిస్తున్నాయి.
కోవిడ్-19 మహమ్మారి తెలుగు రాష్ట్రాలపై పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను పదే, పదే సూచిస్తున్నాయి. మాస్క్ తప్పనిసరి చేయడంతో పాటు భౌతిక దూరం కూడా చాలా ముఖ్యమని చెప్తున్నాయి. అయినా కొందరు మాట వినడం లేదు. ఒకవైపు ప్రాణాలు పోతున్నా కరోనాను లైట్ తీసుకుంటున్నారు.
కరోనా తీవ్రత నేపథ్యంలో మాస్క్ పెట్టుకోకుండా బహిరంగ ప్రాంతాల్లో సంచరించినందుకు తెలంగాణ వ్యాప్తంగా 67,557 మందిపై పోలీసులు ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. మరో 3,288 మందికి ఈ-చలానాలు వడ్డించారు. లాక్డౌన్ ప్రారంభమైన మార్చి 22 నుంచి జూన్ 30వ వరకు 29 పోలీస్ యూనిట్ల పరిధిలో ఈ కేసులు రికార్డయ్యాయి. ఈ లిస్టులో ముఖ్యంగా హైదరాబాద్ టాప్ ప్లేసులో ఉంది. మహానగరంలో 14,931 మందిపై కేసులు నమోదయ్యాయి. తర్వాతి ప్లేసులో రామగుండం కమిషనరేట్(8,290), ఖమ్మం(6,372), సూర్యాపేట(4,213), వరంగల్(3,907) ఉన్నాయి. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు నమోదయ్యాయి.